News December 1, 2025

లక్ష్మీపల్లిలో ఎన్నికల జోష్.. 190 ఓట్లు సాధిస్తే సర్పంచ్

image

ఊట్కూర్ మండల పరిధిలోని చిన్న గ్రామ పంచాయతీ లక్ష్మీపల్లిలో మూడో విడత పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. మొత్తం 383 మంది ఓటర్లు ఉండగా, 6 వార్డులు ఉన్నాయి. 191 ఓట్లు సాధించిన అభ్యర్థి సర్పంచ్ అవుతారు, వార్డు సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 30 ఓట్లు సాధించాలి. చిన్న గ్రామమైనప్పటికీ అభివృద్ధిలో పెద్ద పంచాయతీలకు లక్ష్మీపల్లి గ్రామం ఏమాత్రం తీసిపోకుండా పోటీ పడుతూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Similar News

News March 21, 2026

సంగారెడ్డి: పాలిసెట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 20 వరకు https://polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News March 21, 2026

సిద్దిపేటలో సీఎం పర్యటన-జిల్లా నుంచి ఉచిత బస్సలు

image

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా నుంచి రైతులు పాల్గొనేందుకు ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించనున్నట్లు జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఐడీఓసీ జగిత్యాల, ముత్యంపేట రైతు వేదిక, ధర్మపురి వ్యవసాయ కార్యాలయం నుంచి బస్సులు ఉదయం 8 గంటలకు బయలుదేరుతాయని, రైతులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశామన్నారు.

News March 21, 2026

VZM: ‘క్రమశిక్షణ, సేవాభావంతో ఉన్నత శిఖరాలు సాధ్యం’

image

మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్‌సీసీ విద్యార్థులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్‌సీసీ ద్వారా సేవాభావం పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.