News December 1, 2025

సిద్దిపేట: సమస్యాత్మక గ్రామాల్లో నిఘా

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. గ్రామాల్లో పోలీస్ కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వినియోగించాలని వివరిస్తున్నారు. ఆదివారం గజ్వేల్, మిరుదొడ్డి, అక్బర్పేట్-భూంపల్లి మండలాల్లో ACPల ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలను జాగృతం చేశారు.

Similar News

News March 23, 2026

హార్ముజ్‌లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

image

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్‌బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్‌ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.

News March 23, 2026

వెదురుకుప్పం: జల్లికట్టులో విషాదం.. 3 ఎద్దులు మృతి

image

వెదురుకుప్పం మండలంలో జరిగిన జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. మూడు ఎద్దులు చెరువులో పడి మృతిచెందాయి. వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామంలో ఆదివారం జల్లికట్టు వేడుకలు నిర్వహించారు. జల్లికట్టు చూసేందుకు సమీప గ్రామస్థులు పెద్ద ఎత్తున రావడం, డప్పు వాయిద్యాలకు జల్లికట్టులో బెదిరిన ఎద్దులు చెరువులో దూకడంతో మృతి చెందాయి. వ్యవసాయానికి ఉపయోగపడుతున్న ఎద్దులు మృతి చెందడంతో రైతులు విలపిస్తున్నారు.

News March 23, 2026

మీ BPని పెంచే ‘డేంజర్’ ఫుడ్స్ ఇవే!

image

హై BP గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుంది. రోజూ తినే ప్రాసెస్డ్ మీట్, క్యాన్డ్ సూప్స్, వైట్ బ్రెడ్ వంటి వాటిలో సోడియం విపరీతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి శరీరంలో నీటిని నిలిపి ఉంచి BPని పెంచుతాయి. అలాగే కెచప్, సోయా సాస్, ఫ్రోజెన్ పిజ్జాలు, కూల్ డ్రింక్స్‌లోని చక్కెర కూడా హాని చేస్తాయి. అందుకే ఉప్పు, చక్కెర తగ్గించి.. తాజా కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే BP కంట్రోల్‌లో ఉంటుంది.