News December 1, 2025
రుద్రంగిలో MLA ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
Similar News
News March 8, 2026
వెంకీ-త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ న్యూస్!

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం-AK47’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్లో ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహా కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మూవీని సీరియస్ మోడ్లోకి తీసుకెళ్తుందని సమాచారం. సెకండాఫ్లో ‘AK47’ ట్యాగ్లైన్కు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
News March 8, 2026
MDK: పెరిగిన గ్యాస్ ధర.. రూ.36 కోట్ల భారం

కేంద్రం గ్యాస్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచడంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 11.56 లక్షల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా వినియోగదారులపై ఏడాదికి సుమారుగా రూ.36 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పప్పులు, నూనె, బియ్యం వంటి నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతుండగా తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది.
News March 8, 2026
సూర్యాపేట: షూటింగ్ బాల్లో శిరీష సత్తా

అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన గార్లపాటి శిరీష క్రీడారంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. షూటింగ్ బాల్ క్రీడలో 2024 ఆసియా పోటీల్లో కెప్టెన్గా వ్యవహరించి స్వర్ణ పతకం, 2026లో కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయిలో 5, రాష్ట్ర స్థాయిలో 8 పతకాలు గెలుచుకున్న ఈమె, గ్రామీణ ప్రాంత మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.


