News April 18, 2024
సీఎం జగన్పై దాడి కేసులో నిందితుల అరెస్ట్?

AP: విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు జగన్పై సతీశ్ దాడి చేసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. అతడికి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్లు భావిస్తున్నారు. వీరి అరెస్టుపై పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది. మరికాసేపట్లో పోలీసులు వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు.
Similar News
News January 31, 2026
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో పోస్టులు

<
News January 31, 2026
సిట్ విచారణకు కేసీఆర్?

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రేపు నందినగర్ నివాసంలో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించిన <<19006789>>విషయం తెలిసిందే<<>>. మరోవైపు కేసీఆర్కు సిట్ నోటీసులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నాయి.
News January 31, 2026
28,740 పోస్టులకు నోటిఫికేషన్

పోస్టాఫీసుల్లో 28,740 ఉద్యోగాలకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు నేటి నుంచి FEB 14వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సైట్: https://indiapostgdsonline.gov.in/


