News December 1, 2025

ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లాకు ద్వితీయ స్థానం

image

కామారెడ్డి జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణలో 2025-26 సంవత్సరానికి ద్వితీయ స్థానం లభించిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో కామారెడ్డి ART సెంటర్‌ ద్వారా 2,570, బాన్సువాడ ART ద్వారా 1,411 మంది బాధితులకు వైద్య సేవలందుతున్నాయి. NGOల సహకారంతో, లింక్ వర్కర్‌ల సహాయంతో పాజిటివ్ కేసులు గుర్తిస్తున్నారు.

Similar News

News March 14, 2026

కడప: 2 వారాల గడువు..రూ.97 కోట్లే లక్ష్యం.!

image

జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అస్థి పన్ను బకాయిలు రూ.97.17 కోట్లు పేరుకు పోయాయి. 2 వారాల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల వారీగా బకాయిలు ఇలా (రూ.కోట్లలో) ఉన్నాయి. *KDP – రూ.62.93 *PDTR – రూ.20.14 *PLVD – రూ.4.58 *జమ్మలమడుగు – రూ.2.49
*ఎర్రగుంట్ల – రూ.3.20 *మైదుకూరు – రూ.3.09 *కమలాపురం – రూ.0.74కోట్లు.

News March 14, 2026

నంగునూరు: కేజీబీవీలో మెనూపై కలెక్టర్ సీరియస్

image

నంగునూరు మండలం నర్మేట KGBVని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్.. టమాట పప్పు నాణ్యతను మెరుగుపరచాలని ఆదేశించారు. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకుఇబ్బందులు కలగకుండా చూడాలని ఎస్ఓకు సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.

News March 14, 2026

థర్డ్ పార్టీ అప్లికేషన్లపై అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

తెలియని థర్డ్ పార్టీ అప్లికేషన్లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP అఖిల్ మహాజన్ సూచించారు. వీటి ద్వారా డాటా చోరీ, మొబైల్ హ్యాకింగ్, ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ వారం 14 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.