News December 1, 2025
గూడూరులో దారుణం

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 20, 2026
నెల్లూరు: పెళ్లికి వెళ్తుండగా యాక్సిడెంట్.. ఒకరి స్పాట్ డెడ్

బైకును కంటైనర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మనుబోలు హైవేపై చోటుచేసుకుంది. ఎస్సై శివ రాకేశ్ కథనం మేరకు.. కలువాయికి చెందిన శెట్టి పల్లి రమేశ్ (40) బైక్పై మల్లాంలో జరగబోయే వివాహానికి వెళుతుండగా చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. ఈప్రమాదంలో రమేశ్ అక్కడక్కడే మృతి చెందాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2026
నెల్లూరు: 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా

పదో తరగతి పరీక్షలులో భాగంగా శనివారం 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడినట్లు ఉదయగిరి ప్రాంత పరీక్షల నిర్వహకులు తోట శ్రీనివాసులు ఒక ప్రకటన తెలిపారు. 21వ తేదీన ఈద్ – ఉల్ – ఫితర్ (రంజాన్ ) పర్వదినం రావడంతో ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 20, 2026
నెల్లూరులో దొంగల ముఠా అరెస్ట్

నెల్లూరులో ప్రభుత్వ ఆస్తులను దొంగలిస్తున్న ముఠాను చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత జూబ్లీ హాస్పిటల్ రోడ్డులోని BSNL కార్యాలయంలో కిటికీ రాడ్లు తొలగించి చొరబడి దొంగతనం చేశారు. నిందితులు చెన్నంశెట్టి కుమార్(ముత్తుకూరు ఇందిరమ్మ కాలనీ), దీపాల వెంకయ్య(రాజుపాలెం, కొడవలూరు), అరవ ఖలీ(వేదాయపాలెం)గా గుర్తించారు. మూలాపేటలో అరెస్ట్ చేసి వారి నుంచి 40 మీటర్ల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు.


