News December 1, 2025

జగిత్యాల: రూ.28 లక్షల విలువైన 136 మొబైల్స్ రికవరీ

image

పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్‌ ద్వారా సులభంగా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR‌లో IMEI వివరాలు నమోదు చేస్తే ఫోన్లను త్వరగా ట్రేస్ చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.3.5 కోట్ల విలువగల 1548 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

Similar News

News March 16, 2026

జగిత్యాల : క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక పోటీలు

image

తెలంగాణ రాష్ట్రంలో హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి విద్యార్థుల ప్రవేశానికి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రవికుమార్ తెలిపారు. ఈ నెల 31న జగిత్యాలలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 28న స్పోర్ట్స్ స్కూల్ హకీంపేటలో ఫైనల్ ఎంపికలు జరుగుతాయన్నారు.

News March 16, 2026

కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

image

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్‌టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.

News March 16, 2026

వడగాల్పులపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లా రెవెన్యూ భవన్‌లో ‘వేసవి వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక-2026’పై కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువగా నీరు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.