News December 1, 2025

మాజీ ఎమ్మెల్యే మేడా సంచలన ప్రకటన.. క్లారిటీ.!

image

గత ప్రభుత్వం చేసిన తప్పిదంతో రాజంపేట సంక్షోభంలోకి వెళ్లిందని, రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని మాజీ MLA మేడా మల్లిఖార్జున రెడ్డి పేరుతో ఓ ప్రకటన వైరల్ అయింది. అన్నమయ్య జిల్లాలోకి బద్వేల్ నియోజకవర్గాన్ని కూడా కలిపి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరినట్లు ఉంది. దీనిపై ఆయనను Way2News వివరణ కోరగా.. ఆ ప్రచారానికి తనకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Similar News

News March 15, 2026

NGKL: అడవుల్లో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తం

image

వేసవిలో అటవీ ప్రాంతాల్లో మంటలు వేగంగా వ్యాపిస్తాయని, జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ హెచ్చరించింది. సిగరెట్ ముక్కలు, అగ్గిపుల్లలు పడవేయడం వల్ల భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తు చేశారు. వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రజలు, పర్యాటకులు సహకరించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి అగ్నిప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు

News March 15, 2026

గద్వాల: గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై కలెక్టర్ హెచ్చరిక

image

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గ్యాస్ పక్కదారి పట్టకుండా 11 మంది అధికారులతో ‘డిస్ట్రిక్ట్ ఎనర్జీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 11 గ్యాస్ ఏజెన్సీలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

News March 15, 2026

తిరుపతి: మీకూ మెసేజ్‌లు వస్తున్నాయా..

image

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ లోతేటి కోరారు. మీ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరిస్తూ, మరిన్ని వివరాల కోసం OTP చెప్పమని, ఈ క్లిక్ నొక్కాలని తదితర మోసపూరిత సందేశాలను నమ్మవద్దని సూచించారు. వినియోగదారులు సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని కోరారు.