News December 1, 2025

గద్వాల్: ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి

image

2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాదు నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో సమావేశం నిర్వహించారు. గద్వాల కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, నామినేషన్ల పరిశీలన జరిగిందన్నారు.

Similar News

News March 17, 2026

GNT: అన్‌ఎయిడెడ్ స్కూల్ టీచర్లకు డీఈఓ ప్రకటన

image

గుంటూరు జిల్లాలోని అన్‌ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు డీఈఓ కీలక ప్రకటన చేశారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు www.deognt.blogspot.inను చూడొచ్చన్నారు. దరఖాస్తు దారులకు మార్చి 22న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు గుంటూరులో సర్టిఫికెట్ల పరిశీలన, డెమో క్లాసులు ఉంటాయని అధికారులు తెలిపారు.

News March 17, 2026

గుంటూరు: టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల

image

ఉమ్మడి గుంటూరు (D)లోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన తాత్కాలిక/జనరల్ సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితా DEO అధికార వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్న వారు సంబంధిత ఆధారాలతో మార్చి 22 లోపు గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పీల్ రిసీవింగ్ కమిటీకి సమర్పించాలని సూచించారు.

News March 17, 2026

RKL: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు బెస్ట్ ఇండియన్ గోల్డెన్ పర్సనాలిటీ అవార్డు

image

రాయికల్ పట్టణానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పడాల తిరుపతి బెస్ట్ ఇండియన్ గోల్డెన్ పర్సనాలిటీ అవార్డు దక్కించుకున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల బోటని విభాగాధిపతి ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్, మైక్రో బయాలజీ విభాగాధిపతి రౌతు రాధాకృష్ణలు సన్మానించారు. విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.