News December 1, 2025
గద్వాల్: ఎయిడ్స్ బాధితుల హక్కులపై అవగాహన

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ.. హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తులపై వివక్ష, మానసిక వేధింపులు గురించి వివరించారు.
Similar News
News March 24, 2026
మార్చి 24: చరిత్రలో ఈరోజు

1603: బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775: కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977: భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
News March 24, 2026
వరంగల్ పరిధిలో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసు నమోదు

వరంగల్ నగరంలో సోమవారం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 36మందిని, లైసెన్స్ లేని మరో ఐదుగురుని పట్టుకున్నట్లు సీఐ సుజాత తెలిపారు. నిందితులకు కోర్టు జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
News March 24, 2026
జనగామ: వలకు చిక్కిన 25 కిలోల భారీ బంగారు తీగ

రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ పెద్ద చెరువులో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. సుమారు 25 కిలోల బరువున్న బంగారు తీగ రకం చేప పడటంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని చేపను ఆసక్తిగా వీక్షించారు. సాధారణంగా ఇంత పెద్ద పరిమాణంలో చేపలు కనిపించడం అరుదని, ఇది గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని స్థానికులు తెలిపారు.


