News December 1, 2025
VKB: ప్రజావాణికి 16 ఫిర్యాదులు: అదనపు కలెక్టర్

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వరం పరిష్కారం చూపుతున్నట్లు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలను శాఖల వారీగా అధికారులు వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News March 16, 2026
GDV: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో పోటీలకు రాజ్ కుమార్ ఎంపిక!

గుడివాడకి చెందిన క్రీడాకారుడు రాజ్ కుమార్ మరోసారి జాతీయస్థాయిలో మెరవనున్నారు. ఈనెల 19 నుంచి 22 వరకు మహారాష్ట్రలోని పూణే వేదికగా జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఖో-ఖో టోర్నమెంట్కు ఆయన ఎంపికయ్యారు. AP జట్టు తరఫున రాజ్ కుమార్ ప్రాతినిధ్యం వహించడంపై AP ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ రాజ్ కుమార్ జాతీయ పోటీల్లో పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చారని ఆయన కొనియాడారు.
News March 16, 2026
వినియోగదారుల చట్టాలపై అవగాహన ఉండాలి: జడ్జి

సంగారెడ్డి మండలం కులబ్గూర్లోని ఓ పాఠశాలలో సోమవారం వినియోగదారుల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ.. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News March 16, 2026
గిరిజన ఆర్గానిక్ ఉత్పత్తులకు భద్రగిరి మార్ట్లో ప్రత్యేక ప్యాకింగ్

శ్రీరామనవమి కంటే ముందుగా ప్రారంభించబోయే భద్రగిరి మార్ట్లో గిరిజన గ్రామాల్లో లభించే ఆర్గానిక్ నిత్యావసరాలను ప్రత్యేక ప్యాకింగ్తో విక్రయించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్హెచ్జీ మహిళలు, గిరిజనుల చిన్నతరహా పరిశ్రమల ద్వారా తయారయ్యే తృణధాన్యాలు, హస్తకళా వస్తువులు అందుబాటులో ఉంచాలని అన్నారు.


