News December 1, 2025

ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ నరసింహ

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. పెన్ పహాడ్ మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే, ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

Similar News

News March 5, 2026

భర్త జీతం నుంచి నేరుగా భార్య ఖాతాకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

కూతురితో జీవిస్తున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలు పాటించని భర్తకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రతి నెలా అతని జీతం నుంచి ₹25Kను నేరుగా భార్య ఖాతాలో జమ చేయాలని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అతను 2022 నుంచి భార్య నుంచి విడిగా ఉంటూ భరణం ఇవ్వట్లేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా ‘భరణం దాతృత్వం కాదని, భార్య, పిల్లలు గౌరవంగా జీవించడానికి ఉద్దేశించిన చట్టపరమైన హక్కు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

News March 5, 2026

అహోబిలంలో తెప్పోత్సవాలు ప్రారంభం

image

దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. 46వ పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో, కావు రామానుజన్ అధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆలయం నుంచి ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకు వచ్చారు. తెప్పలో ఉంచి ఐదు చుట్టులు విహరింపజేశారు.

News March 5, 2026

భద్రాద్రి: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్‌ను జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు జడ్జి వసంత్ పాటిల్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సూచించారు.