News December 1, 2025
2026లోనే తేలనున్న కృష్ణా జలాల వివాదం!

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్-II తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదని కేంద్రమంత్రి రాజ్ భూషణ్ వెల్లడించారు. నిర్ణయాన్ని వెల్లడించేందుకు గడువు పొడిగించాలని ట్రిబ్యునల్ కోరిందన్నారు. దీంతో 2025 AUG 1 నుంచి జులై 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో నీటి పంపకాల పంచాయితీకి వచ్చే ఏడాదే ముగింపు దొరకనుంది.
Similar News
News March 15, 2026
పుట్టా మహేశ్ను వదిలేసిన పోలీసులు

TG: డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన TDP MP పుట్టా మహేశ్ను శంషాబాద్ రూరల్ పోలీసులు వదిలిపెట్టారు. ఆయనతో పాటు ఫామ్హౌస్లో పట్టుబడ్డ ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్ మీద నోటీసులు ఇచ్చి పంపించేశారు. BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి(రోహిత్ రెడ్డి సోదరుడు), నమిత్ను ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్హౌస్లో కొకైన్ తీసుకుంటూ మహేశ్, రోహిత్ దొరికారు.
News March 15, 2026
4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది!

తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి (UT) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9న కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరగనుంది. వెస్ట్ బెంగాల్లో ఏప్రిల్ 23, 29న రెండు విడతల్లో, ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటి ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. 4 రాష్ట్రాలు సహా ఒక UTలో కలిపి 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.
News March 15, 2026
‘భీష్మ ప్రతిజ్ఞ’ అంటే ఏమిటి?

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ల గురించి చెప్పే సందర్భంలో ‘భీష్మ ప్రతిజ్ఞ’ నానుడిని వాడతారు. భారతంలో భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతని తండ్రి శంతనుడు దాశరాజు కుమార్తె సత్యవతిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటాడు. తన కూతురి కొడుకే రాజు కావాలని దాశరాజు కోరగా తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు అంగీకరించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారు. అందుకే ఆయనకు భీష్ముడిగా పేరు వచ్చింది.
<<-se>>#EPICSAYINGS<<>>


