News December 1, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

image

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, భద్రత, సభాస్థలి, రవాణా నిర్వహణ వంటి అంశాలను అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. రేపు జరగనున్న ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలని అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News March 21, 2026

అనంత: టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్

image

అనంతపురం JNTU 15వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్ 6న నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్‌ను ‘Missile Woman of India’గా పిలవబడే DRDO మాజీ డైరెక్టర్ జనరల్ టెస్సీ థామస్‌కు ఇవ్వనున్నారు. ఆమె గతంలో అగ్ని-IV, అగ్ని-V క్షిపణులకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. దేశంలోని క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్త కూడా ఈమె కావడం విశేషం.

News March 21, 2026

గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరణ.. రూ.211 కోట్ల జరిమానా

image

హై రిస్క్ ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళకు వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించిన కంపెనీకి ఒహాయో జ్యూరీ(US) భారీ జరిమానా విధించింది. తప్పని పరిస్థితుల్లో ఆమె ఆఫీసుకు వెళ్లడంతో నెలలు నిండకుండానే జన్మనిచ్చారు. దీంతో కొన్ని గంటల్లోనే బిడ్డ మరణించింది. ఇందుకు కంపెనీనే కారణమని తేల్చిన జ్యూరీ ఆ కుటుంబానికి $22.5 మిలియన్లు(రూ.211.52 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనిపై సంస్థ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

News March 21, 2026

మంచిర్యాల: ఆర్టీసీ ద్వారా రాములోరి తలంబ్రాలు

image

భద్రాది శ్రీ రాములవారి తలంబ్రాలు ఆర్టీసీ కార్గో ద్వారా అందజేస్తామని MNCL డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం దీనికి సంబంధించిన కరపత్రాలను డిపో వద్ద ఆవిష్కరించారు. కార్గో ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్నామని, మేడారం సమ్మక్క సారలమ్మ బంగారాన్ని (బెల్లం) కూడా అందజేసినట్లు తెలిపారు. శ్రీరాములోరి తలంబ్రాల కోసం ఆర్టీసీ కార్గోను సంప్రదించాలని కోరారు.