News December 1, 2025

ప్రాజెక్టులను ఆపాలన్న కుట్రలు విఫలమే: సీఎం హెచ్చరిక

image

మక్తల్- NRPT–కొడంగల్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కొందరు కుట్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని సీఎం తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టులు ఆగవని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందజేస్తామని, ఏ రైతుకు అన్యాయం జరగనీయమని హామీ ఇచ్చారు. మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధి ఆపొద్దని రైతులను కోరారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు పెద్దపీట వేస్తామన్నారు.

Similar News

News March 20, 2026

పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

image

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్‌పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

News March 20, 2026

గోదావరి నదిలో గల్లంతైన వారి వివరాలు ఇవే..!

image

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలోకి దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.

News March 20, 2026

‘పోలవరం జిల్లాలో గ్యాస్ కొరత లేదు’

image

పోలవరం జిల్లాలోని 8గ్యాస్ ఏజెన్సీలలో 1872 వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ విజయ భాస్కర్ శుక్రవారం తెలిపారు. రంపచోడవరంలో జీసీసీ గ్యాస్ గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ బుక్ ప్రకారం 352 సిలిండర్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఎటువంటి కొరతలేదని, బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం 352 మంది గ్యాస్‌ కోసం నమోదు చేసుకున్నారన్నారు.