News December 1, 2025
అన్నమయ్య: మంచి మనసు చాటుకున్న హోంగార్డులు

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పవన్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు జిల్లాలోని హోంగార్డులు ముందుకొచ్చి తమ ఒక రోజు డ్యూటీ అలవెన్స్ను విరాళంగా అందించారు. మొత్తం రూ.2,30,000ను సమకూర్చి, ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో ఎస్పీ ధీరజ్ చేతుల మీదుగా పవన్ కుమార్ రెడ్డి తల్లి రాధకు అందజేశారు.
Similar News
News March 19, 2026
రాజంపేట: వర్షంతో రైతులకు నష్టం

రాజంపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. హస్తవరం, చెర్లోపల్లి, కొత్తపల్లి, ఆకేపాడు తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో అరటి పంటలు నేలకొరిగాయి. పంట కోత దశలో ఉండగా, ఒకే రాత్రిలో నాశనం కావడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన పంటలపై సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
News March 19, 2026
సంస్కృతికి ప్రతీక ఉగాది పచ్చడి: ఎస్పీ

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణాన్ని SP రాజేష్ చంద్ర, ఇతర పోలీస్ అధికారులు ఆలకించారు. కార్యక్రమం అనంతరం SP స్వయంగా ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఉగాది పచ్చడి అనేది కేవలం ఆరు రుచుల మిశ్రమం మాత్రమే కాదని, అది మన భారతీయ సంస్కృతికి, జీవిత సత్యాలకు ప్రతీక అని SP పేర్కొన్నారు.
News March 19, 2026
‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.


