News December 1, 2025

NRPT: మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పదవి వీడి సర్పంచ్‌గా నామినేషన్

image

బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కూరగాయల రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి BRSలో చేరారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా తగిన గౌరవం లభించలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్‌లో చేరిన అనంతరం ధన్వాడ మండల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నీరటి సుజాత రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 17, 2026

నల్గొండ: ఉరుములు, మెరుపులతో వర్షాలు..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 8 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున, రైతులు తమ పంట ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News March 17, 2026

పులివెందుల: కొండంతో దు:ఖంలోనూ..

image

పదవ తరగతి పరీక్ష రాసిన అనంతరం తండ్రి అంత్యక్రియల్లో విద్యార్థిని పాల్గొన్న ఘటన పులివెందులలో చోటు చేసుకుంది. సోమవారం బయమ్మ తోటలో ఉన్న దండు శివయ్య కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ధరణి 10వ తరగతి చదువుతోంది. ఉదయం పదవ తరగతి పరీక్ష ఉండగా.. అదే సమయంలో తండ్రి మృతి చెందాడు. ఈ బాధను దిగమింగుకొని విద్యార్థిన పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది.

News March 17, 2026

WGL: కోడి గుడ్డు ధరలు దిగి వస్తున్నాయి!

image

పశ్చిమాసియాలో యుద్ధ అనిశ్చితి కోడిగుడ్ల ధరలపై ప్రభావం చూపిస్తోంది. హనుమకొండ, వరంగల్ పరిసరాల్లో పౌల్ట్రీల నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో కోడిగుడ్ల ధరలు దిగి వచ్చాయి. జిల్లాలో పౌల్ట్రీ రైతులు రూ.7 చొప్పున హోల్ సేల్‌గా విక్రయిస్తే వినియోగదారులకు రూ.7.50 అమ్మేవారు. ఎగుమతులు తగ్గిపోవడంతో ప్రస్తుతం రూ.4.50 చొప్పున హోల్ సేల్‌గా అమ్ముతున్నారు. రిటైల్ మార్కెట్లో రూ.5కు లభిస్తోంది.