News December 1, 2025

టీటీడీలో అన్యమతస్తులపై నివేదిక తయారీ

image

టీటీడీలో అన్యమతస్తుల అంశం మరోసారి తెర పైకి వచ్చింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలో ఇంకా ఎవరైనా ఆన్యమతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.

Similar News

News March 7, 2026

దేశంలోనే అతిపెద్ద లొంగుబాటు: రేవంత్

image

TG: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద మావోయిస్టు <<19321592>>లొంగుబాటు<<>> అని CM రేవంత్ అన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మిగతావాళ్లంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. గణపతి రక్షణ, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోలకు ఆరోగ్య, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామన్నారు. మావోలు లేవనెత్తిన రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

News March 7, 2026

భద్రాద్రి: మనోడి సినిమాకు ‘గద్దర్’ అవార్డుల పంట

image

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘గద్దర్’ అవార్డుల్లో ఇల్లందు(M) కొమరానికి చెందిన సాయిలు కాంపాటి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఆయన తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం ఉత్తమ సినిమాగానూ నిలిచింది. ఇదే చిత్రంలో నటించిన చైతు జొన్నలగడ్డ ఉత్తమ నటుడిగా, అనురాగ్ ఉత్తమ గాయకుడిగా అవార్డులు దక్కించుకున్నారు. 4 రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికవ్వడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 7, 2026

భిక్కనూర్: పురుగుల అన్నంపై విచారణ

image

భిక్కనూర్ మండలం భగీరథపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పురుగుల అన్నంపై శనివారం విచారణ జరిపారు. విద్యార్థులకు పురుగులతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడంతో విద్యార్థులు పారబోశారు. దీనిపై విచారణ జరిపించాలని ఎన్సీడీ వైద్యాధికారి శిరీషను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈ మేరకు ఆమె పాఠశాలకు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు. ఏజెన్సీ నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం వివరాలు సేకరించారు.