News December 1, 2025
25,487 ఉద్యోగాలు.. అర్హతలివే

సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 25,487 కానిస్టేబుల్(GD) ఉద్యోగాలకు <<18442408>>నోటిఫికేషన్<<>> విడుదలైంది. అర్హతలు: 01-01-2026 నాటికి 18-23ఏళ్ల వయసు(రిజర్వేషన్ బట్టి సడలింపు), టెన్త్ ఉత్తీర్ణత సాధించాలి. అప్లికేషన్ ఫీజు రూ.100. NCC ‘A’ సర్టిఫికెట్ ఉంటే 2%, NCC ‘B’కి 3%, NCC ‘C’కి 5% మార్కులను జత చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్, PET, PST ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://ssc.gov.in
Similar News
News April 6, 2026
కమలం పార్టీకి 47 ఏళ్లు

ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. అటల్ బిహారి వాజ్పేయి, LK అద్వానీ దీన్ని స్థాపించారు. 1984లో తొలిసారి సాధారణ ఎన్నికలను ఎదుర్కొని కేవలం 2 సీట్లలోనే గెలిచింది. రామజన్మభూమి ఉద్యమంతో 1989లో 75 సీట్లు వచ్చాయి. 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1996, 98, 99లో వాజ్పేయి మూడు సార్లు ప్రధాని అయ్యారు. 2014 నుంచి మోదీ ప్రధానిగా కొనసాగుతున్నారు.
News April 6, 2026
బ్రాండింగ్ కోసం బౌండరీ దాటిన జొమాటో.. ఫ్యాన్స్ ఫైర్!

నిన్నటి IPL మ్యాచ్ సందర్భంగా జొమాటో చేసిన ఓ పోస్ట్ తమిళనాడు, కర్ణాటక అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘చెన్నై సాంబార్ కంటే బెంగళూరు సాంబార్ బెటర్’ అంటూ ZOMATO చేసిన పోస్ట్ తమ ప్రాంతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రచారం కోసం ప్రాంతీయ సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు. చాలామంది జొమాటో యాప్ అన్ఇన్స్టాల్ చేసి పోస్టులు పెడుతున్నారు.
News April 6, 2026
కాలు వాపుగా ఉందా? ప్రాణాపాయం కావచ్చు: రాజీవ్ కనకాల

కాలు వాపు, నొప్పి లేదా వేడి చేసినా నిర్లక్ష్యం చేయవద్దని నటుడు రాజీవ్ కనకాల సూచించారు. ఇది రక్త గడ్డలకు (DVT) సంకేతం కావచ్చని హెచ్చరించారు. ‘ఈ గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం కలగవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం, లాంగ్ ట్రావెల్ చేసేవారు మధ్యమధ్యలో నడవాలి. నీళ్లు బాగా తాగాలి. సకాలంలో గుర్తిస్తే ఈ సమస్యను పూర్తిగా నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు’అని ఆయన అవగాహన కల్పించారు.


