News December 2, 2025
పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.
Similar News
News March 7, 2026
మహిళలు ముందుకు వస్తేనే నిజమైన అభివృద్ధి: నిర్మల్ ఎస్పీ

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తేనే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మహిళల భద్రత, సాధికారత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. నిర్మల్ జిల్లాలో మహిళా పోలీసుల ద్వారా ‘పోలీస్ అక్క’, ‘నారిశక్తి’, ‘శివంగి’ వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మహిళల భద్రతకు మరింత బలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నమని వివరించారు.
News March 7, 2026
సంగారెడ్డి: అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వాల్టా, మోటార్ వాహనాల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమించే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సాండ్ బజార్ల ద్వారా ప్రభుత్వ ఇసుక సరఫరాను పర్యవేక్షించాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచాలని సూచించారు.
News March 7, 2026
నెలకు ₹2,500.. ఫ్రీ బస్ జర్నీ: మహిళలకు TVK చీఫ్ వరాలు

తమిళనాడు ఎన్నికల దృష్ట్యా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు TVK చీఫ్ విజయ్ కీలక హామీలు ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లేడీస్ కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏటా ఫ్రీగా 6 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాఠశాల చిన్నారులకు ఏడాదికి ₹15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామని హామీ ఇచ్చారు.


