News December 2, 2025

నేడు ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రాక

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News March 8, 2026

మహబూబాబాద్: మహిళలపై పెరుగుతున్న దాడులు

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడాది కాలంగా మహిళలపై అనేక దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 176 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. 42 ఈవ్ టీజింగ్ కేసులు, 55 అత్యాచారం కేసులు, 5 వరకట్న హత్యల కేసులు, 9 మహిళల హత్యల కేసులు, 178 అత్యాచారయత్నం కేసులు నమోదయ్యాయి. మహిళలపై వేదింపుల కేసులను షీ టీం పోలీస్ స్టేషన్లు పరిష్కారించనుంది.

News March 8, 2026

అనకాపల్లి: ‘అమ్మా, నాన్న సారీ’.. సూసైడ్ నోట్‌లో విద్యార్థిని

image

గొలుగొండ(M) ఏఎల్ పురం జడ్పీ హైస్కూల్లో 10th విద్యార్థిని వింజరపు దుర్గా లక్ష్మి తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. ‘అమ్మానాన్న సారీ.. తమ్ముణ్ని బాగా చూసుకోండి, నాకు స్నేహితులందరూ ఇష్టమే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నానని’ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. గత కొద్ది రోజులుగా బాలిక ముభావంగా ఉన్నట్లు తోటి స్నేహితులు చెప్పినట్లు సమాచారం.

News March 8, 2026

చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

image

చమురు ఉత్పత్తి, ఎగుమతులను నిలిపేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి మూతతో ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు అనుకూలించాక ప్రొడక్షన్ తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది. OPECలో 5వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు కువైట్. సగటున రోజుకు 2.6M బ్యారెళ్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఖతర్, ఇరాక్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. UAE కూడా క్రూడాయిల్ ప్రొడక్షన్‌ కట్ చేస్తున్నట్లు తెలిపింది.