News December 2, 2025
ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రిటర్నింగ్ ఆఫీసర్లకు పూర్తి బాధ్యత ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News March 13, 2026
పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించారా?

TG: ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్ను ఉచితంగా వేస్తున్నారు. పాడి రైతులు నిర్లక్ష్యం చేయకుండా జీవాలకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని, ఏమైనా సందేహాలుంటే సమీపంలోని వెటర్నరీ డాక్టర్లను సంప్రందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.
News March 13, 2026
సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

TG: సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.
News March 13, 2026
కొబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే..

కొబ్బరినూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. కొబ్బరినూనెను కాస్త వేడిచేసి అందులో కాస్త ఉసిరి పొడిని వేయాలి. ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా గంట పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చెయ్యాలి. దీని వల్ల స్కాల్ప్లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.


