News December 2, 2025
ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3 దశల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. ఇందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News March 28, 2026
రైతులకు ఐడీ కార్డులు.. ₹215 కోట్లతో ప్రోత్సాహకాలు

TG: రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయనుంది. వీటి ద్వారా లోన్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఈజీగా అందుతాయి. ₹215 కోట్ల బడ్జెట్తో పందిళ్లు, యంత్ర పరికరాలపై 50% సబ్సిడీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకూ సహకారం అందించనుంది.
News March 28, 2026
లింగాపూర్: చెరువులో గుర్తుతెలియని మహిళ శవం లభ్యం

లింగాపూర్ గ్రామ శివారులోని చెరువులో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ (35-40 ఏళ్లు) శవం లభ్యమైందని దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా ఈ మహిళను గుర్తించినట్లయితే వెంటనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు సంప్రదించాలని ఆయన కోరారు. దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
News March 28, 2026
HYDలో దంచికొట్టిన వర్షం.. రికార్డు వివరాలు ఇవే..!

HYD నగరంలో రాత్రి వర్షం దంచికొట్టింది. పాత GHMC పరిధి అల్వాల్ అంబేడ్కర్ నగర్లో అత్యధికంగా 14.0 మి.మీ వర్షం కురిసింది. కాప్రా, కుషాయిగూడలో 13.8 మి.మీ, వెస్ట్ మారేడ్పల్లిలో 13.0 మి.మీ వర్షం పడింది. నేరెడ్మెట్, ఆనంద్ బాగ్, మౌలాలి, సఫిల్గూడ ప్రాంతాల్లో 12 మి.మీకి పైగా వర్షపాతం నమోదైనట్లు TGDPS తెలిపింది. వేసవి వేళ వర్షం కాస్త ఉపశమనం కలిగించి.


