News December 2, 2025
అనకాపల్లి: ‘టెన్త్ విద్యార్థుల శత శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి’

జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఉపాధ్యాయులు అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. అనకాపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాలలో హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్తో సమావేశం నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ నెల 5న మెగా పీటీఎం సమావేశం పండుగ వాతావరణంలో జరగాలన్నారు. డీఈఓ అప్పారావు, ఆఐఓ వినోద్ బాబు పాల్గొన్నారు.
Similar News
News March 20, 2026
హెడ్ ఇంజూరీ.. ‘గోల్డెన్ అవర్’ కీలకం

తలకు తీవ్ర గాయమైనప్పుడు తొలి 60 నిమిషాలు అత్యంత కీలకమని వైద్యులు చెబుతున్నారు. దీన్నే ‘గోల్డెన్ అవర్’ అంటారు. ‘ఈ గంటలో ప్రతి నిమిషంతో పోటీ పడి బాధితులను ఆసుపత్రికి తరలించాలి. ప్రధానంగా బ్లీడింగ్ అదుపు చేయాల్సి ఉంటుంది. పేషంట్ను తరలించే సమయంలోనూ మెడ కదలకుండా చూసుకోవాలి. గంటలోపు చికిత్స అందిస్తే సాధ్యమైనంతవరకు ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు’ అని తెలిపారు.
* ఇవాళ వరల్డ్ హెడ్ ఇంజూరీ అవేర్నెస్ డే
News March 20, 2026
25న నంద్యాలలో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో ఈ నెల 25న నంద్యాలలోని NTR షాదీఖానలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై 870 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి PG వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులు నేరుగా హాజరు కావాలని సూచించారు.
News March 20, 2026
అమలాపురం: డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్ రీషెడ్యూల్

రంజాన్ సెలవు శనివారం నాటికి మార్పు కావడంతో లెర్నర్స్, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్స్ను శుక్రవారానికి రీషెడ్యూల్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని కోరారు. అభ్యర్థులు శనివారం కాకుండా శుక్రవారమే సంబంధిత కార్యాలయానికి రావాలని సూచించారు. సెలవు మార్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.


