News December 2, 2025
పలు శాఖలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన: కలెక్టర్

ప్రభుత్వం అమలు చేస్తున్న సేవల పట్ల ప్రజల అభిప్రాయాన్ని మెరుగుపరిచే విధంగా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ హాలులో శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంత మేరకు చేరుతున్నాయనే అంశంపై వివిధ మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు. వాటిలో వైద్య ఆరోగ్య, దేవాదాయ, సర్వే, వ్యవసాయ శాఖలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన ఉందన్నారు.
Similar News
News March 19, 2026
ఉగాది స్పెషల్.. ఉమ్మడి జిల్లాలో గోవులకు పూజలు..!

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో గోమాతలకు పూజలు నిర్వహించారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండలో ఆవులు, దూడలకు పూజలు చేసి పిండి పదార్థాలను తినిపించారు. గ్రామస్థుల ఇండ్లలో ఉండే వాహనాలు, వ్యవసాయానికి వినియోగించే యంత్ర పరికరాలకు సైతం అందంగా ముస్తాబు చేసి పూజలు చేశారు. పాడిపంటలు చల్లగా ఉండాలని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు.
News March 19, 2026
జనగామ: మంజూరైనవి 5,647.. పూర్తయినవి 241..!

జనగామ జిల్లాలో రెండో విడతలో 5,647 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 241 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, స్లాబ్ దశలో 2,920, పునాది దశలో 1128, మార్కింగ్ చేసినా పునాది పనులు కానివి 450 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 908 ఇండ్లకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. పనులు నెమ్మదించిన ఇళ్లపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు.
News March 19, 2026
సౌదీ అరామ్కో రిఫైనరీపై ఇరాన్ దాడి

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన సౌదీకి చెందిన అరామ్కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. నష్ట తీవ్రతపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపారు. ‘సౌత్ పార్స్’పై అటాక్కు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ వరుస <<19422796>>దాడులు<<>> చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


