News December 2, 2025

బయట రాష్ట్రాల ఎర్రచందనం నిల్వలు ఎలా తీసుకొస్తారు..?

image

శేషాచలం అడవుల నుంచి తరలిపోయిన అరుదైన ఎర్రచందనం అధికారిక లెక్కల ప్రకారం 6 రాష్ట్రాల్లో సుమారు 8వేల టన్నుల నిల్వ ఉంది. ఇందులో కర్ణాటక వేలం వేసుకుందని మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేందుకు జీవో కూడా తెచ్చామన్నారు. అయితే ఆ ఆదాయాన్ని ఆ రాష్ట్రాలు వదులుకునే పరిస్థితి లేదట. పవన్ పర్యాటన ముగిసి నెల కావస్తున్న తరుణంలో అధికారులు ఏమి చేసారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.

Similar News

News March 22, 2026

ఈ జిల్లాల్లో రేపు పిడుగులతో వర్షాలు!

image

AP: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందంది. ఉరుములు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండరాదని సూచించింది.

News March 22, 2026

VZM: సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం

image

విజయనగరం జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్‌ను నియమించినట్లు జిల్లా గనులు భూగర్భ శాఖాధికారి సూర్య చంద్రరావు ఆదివారం తెలిపారు. ఈనెల 23 నుంచి జూన్ 16 వరకు ఇసుక, రాయి, మట్టి, గ్రానైట్ వంటి ఖనిజాలు తీసుకునే వారి నుంచి ఈ సంస్థ నిర్ణీత సీనరేజ్ ఛార్జీలను వసూలు చేయనుంది. లీజుదారులు, ప్రజలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహకరించాలని కోరారు.

News March 22, 2026

23 నుంచి జనగణన ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ: DRO

image

సోమవారం నుంచి జనగణన చేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 2027 సం. జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణ కోసం సంబంధిత అధికారులు తప్పక హాజరు కావాలని డీఆర్ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు.