News December 2, 2025
పార్వతీపురం: ‘పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు ముఖ్యం’

జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ముఖ్యమని, అందుకే ఈ ప్రత్యేక వైద్య శిబిరమని జిల్లా డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు. ఆరోగ్యవంతమైన సిబ్బంది మాత్రమే సమర్థవంతంగా పనిచేయగలుగుతారన్నారు.
Similar News
News March 15, 2026
అన్నమయ్య: భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త అరెస్ట్

రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లిలో జరిగిన కృష్ణవేణి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త శ్రీనివాసులును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కృష్ణవేణి బెడ్రూమ్లో ఉరివేసుకుంటుండగా, కాపాడకపోగా శ్రీనివాసులును సెల్ఫోన్లో వీడియో తీస్తూ సరిగ్గా వేసుకో అంటూ నవ్వుతూ వెటకారం చేశాడు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో సెక్షన్ 108 BNS కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News March 15, 2026
అలర్ట్.. ‘జిల్లాలో అక్కడ 144 సెక్షన్’

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరూ ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 15, 2026
‘భీష్మ ప్రతిజ్ఞ’ అంటే ఏమిటి?

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ల గురించి చెప్పే సందర్భంలో ‘భీష్మ ప్రతిజ్ఞ’ నానుడిని వాడతారు. భారతంలో భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతని తండ్రి శంతనుడు దాశరాజు కుమార్తె సత్యవతిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటాడు. తన కూతురి కొడుకే రాజు కావాలని దాశరాజు కోరగా తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు అంగీకరించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారు. అందుకే ఆయనకు భీష్ముడిగా పేరు వచ్చింది.
<<-se>>#EPICSAYINGS<<>>


