News December 2, 2025
RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.
Similar News
News March 14, 2026
పది పరీక్షలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు: రంగారెడ్డి DEO

పదోతరగతి పరీక్షలకు ఉదయం 9:35 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్ రావు అన్నారు. ప్రతి సెంటర్ను ఒక సిట్టింగ్ స్క్వాడ్ సహా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో పది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చూచిరాతలు, చీటీలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు తెలిపారు.
News March 14, 2026
RR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం వాటిని ఖాళీ చేసి, సొంతూళ్లకు పయనమయ్యారు. రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఫస్టియర్లో 84,301 మంది, సెకండియర్లో 70,171 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 200 పరీక్ష కేంద్రాల్లో 96 శాతం మంది హజరయ్యారు.
News March 14, 2026
RR: టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న 53,058 మంది

నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 255 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలను బాగా రాయాలని ఉపాధ్యాయులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


