News December 2, 2025
ఖమ్మం: ఓటు హక్కుపై యువత వినూత్న కార్యక్రమం

ప్రజాస్వామ్య బలోపేతంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన యువకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సోమవారం ‘Cast Your Vote’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో వారు తమ సామాజిక బాధ్యతను చాటుకుని, మిగతా యువత అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News March 28, 2026
విజయనగరం, మన్యం జిల్లాలకు వడగాల్పుల అలర్ట్

ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని AP విపత్తు నిర్వహణ సంస్థ MD కన్నబాబు ప్రఖర్ తెలిపారు. విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడిదాం, రాజాం, రేగిడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
News March 28, 2026
TU: రీవాల్యూయేషన్కు అప్లై చేసుకున్నారా..!

తెలంగాణ వర్సిటీ పరిధిలోని B.Ed, B.P.Ed 1, 3 సెమిస్టర్ల రెగ్యులర్ విద్యార్థులు రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని ఎగ్జామ్ కంట్రోలర్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ఏప్రిల్ 4 లోగా దరఖాస్తు చేసుకోవాలని, కాలేజీ యాజమాన్యాలు ఆ దరఖాస్తులను ఏప్రిల్ 7 లోగా వర్సిటీలో సమర్పించాలని అన్నారు. పూర్తి వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
News March 28, 2026
పాలమూరు: వేడి గంజిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

NRPT జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూర్ గ్రామంలో విషాదం నెలకొంది. సుధాబాయి, నరసింహులు దంపతుల కుమార్తె నందిని (3) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి గంజిలో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే రాయచూర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకొన్నాయి.


