News December 2, 2025
పల్నాడు: ప్రభుత్వ సంస్థల మొండి బకాయిలు

జిల్లాలోని మున్సిపాలిటీలకు ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వ సంస్థల నుంచే ఆస్తి పన్ను మొండి బకాయి అధికంగా ఉంది. నరసరావుపేట (₹3 కోట్లు), సత్తెనపల్లి (₹1.05 కోట్లు), మాచర్ల (రూ.1 కోటి) చిలకలూరిపేట (రూ.80 లక్షలు), వినుకొండ (రూ.46 లక్షలు) సహా పలు మున్సిపాలిటీలకు మొత్తం ₹52.36 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉంది. ఈ బకాయిల వసూలు మున్సిపల్ అభివృద్ధికి ఆటంకంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 15, 2026
అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
News March 15, 2026
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఓఎంఆర్ షీట్లోని సబ్జెక్టు కోడ్, రూమ్ నెంబర్ వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
News March 15, 2026
కర్నూలు: ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ను మోసం చేసిన ఘనుడు

ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన ట్రాన్స్జెండర్ గీతను, చిన్నటేకూరుకు చెందిన పరశురాం ప్రేమ పేరుతో వంచించినట్లు బాధితురాలు ఆరోపించింది. 2024 నుంచి పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు డబ్బు అడిగితే అసభ్యకరంగా దూషిస్తూ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని గీత పోలీసులను ఆశ్రయించింది.


