News December 2, 2025
NTR: ఏం పంపిస్తున్నారో.. అసలు చూస్తున్నారా..?

విజయవాడ డివిజన్ పరిధిలో RTC కార్గో సర్వీసుల ద్వారా ఏటా రూ.120 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అయితే తనిఖీలు మాత్రం ప్రశ్నార్ధకంగా మారాయి. నిఘా లేకపోవడంతో కొందరు డ్రగ్స్ను దర్జాగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల బస్సులు పార్సిల్స్ కోసం 45 నిమిషాలు ఆగుతున్నా, సరకుల పరిశీలన లేదు. పేలుడు పదార్థాలు రవాణా అయినా గుర్తించే వీలు లేకపోవడం ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారిందంటున్నారు.
Similar News
News March 17, 2026
మార్చి17: చరిత్రలో ఈరోజు

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)
News March 17, 2026
NZB: నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు

ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈవీ టూ వీలర్, త్రీ వీలర్, సోలార్ పంపు సెట్ల కోసం మార్చి 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదన్నారు. https://tgobmms.cgg.gov.in సందర్శించాలన్నారు.
News March 17, 2026
‘మూడు రోజుల పాటు వర్ష సూచన’

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.


