News December 2, 2025
జపం చేసేటప్పుడు మధ్య వేలును ఎందుకు ఉపయోగిస్తారు?

యోగ శాస్త్రం ప్రకారం.. మధ్య వేలు నుంచి ఓ ముఖ్యమైన ప్రాణశక్తి ప్రవహిస్తుంది. జపం చేసేటప్పుడు ఈ వేలిని ఉపయోగించడం వలన మనస్సు శుద్ధి జరిగి, నాడీ వ్యవస్థ బలపడుతుంది. దీనికి మంత్ర శక్తి తోడై కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. దీని ప్రభావం మనసు చంచల స్వభావాన్ని నియంత్రిస్తుంది. అలాగే మనిషిని అంతరాత్మతో అనుసంధానం చేస్తుంది. ఫలితంగా, ఆధ్యాత్మిక బంధం బలపడుతుంది. భగవంతుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి.
Similar News
News March 24, 2026
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి: కలెక్టర్

మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం భీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని వంట గది, సరుకు నిల్వల గది, భోజన శాల, వసతి గృహాలను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఎప్పటికపుడు రిజిస్ట్రార్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. తహశీల్దార్ రమేశ్ తదితరులున్నారు.
News March 24, 2026
దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి ఛాలెంజ్కైనా సిద్ధంగా ఉండాలని రాజ్యసభ వేదికగా PM మోదీ పిలుపునిచ్చారు. వార్ ఇంపాక్ట్ చాలా కాలం ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు జట్టుగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని కోరారు. వలస కార్మికులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారు.
News March 24, 2026
మీ దగ్గర ₹713 ఉన్నాయా? అయితే మీరు ఇరాన్లో కోటీశ్వరులే!

ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ దారుణంగా పడిపోవడంతో సామాన్యుల జీవితం అతలాకుతలమవుతోంది. మన దగ్గర కేవలం ₹713 ఉంటే అక్కడ కోటి రూపాయలతో సమానం. అదే డాలర్తో పోల్చితే $7.60 మాత్రమే. వినడానికి జోక్గా అనిపించినా అక్కడి తీవ్ర ద్రవ్యోల్బణానికి ఇది నిదర్శనం. యుద్ధ భయాలు, అంతర్జాతీయ ఆంక్షల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది.


