News December 2, 2025
ములుగు: ఎస్సై హరీశ్ మృతి.. నేటికి ఏడాది!

ములుగు జిల్లా వాజేడు ఎస్సైగా పని చేసిన రుద్రారపు హరీశ్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు నేటికీ ఏడాది. డిసెంబర్ 2న ఆయన ముళ్లకట్ట వద్దనున్న రిసార్టులో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని, మృతి చెందిన సమయంలో తనతో యువతి సైతం రీసార్ట్లో పక్కనే ఉండడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
Similar News
News March 14, 2026
తిరుపతి: హాల్ టికెట్ ఉంటే ఫ్రీ జర్నీ

తిరుపతి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. బస్సులో హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. పరీక్షల రోజుల్లో అదనపు ట్రిప్పులు నడపాలని తిరుపతి జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.జగదీష్ డిపో మేనేజర్లను ఆదేశించారు.
News March 14, 2026
సామాన్యుడికి చికెన్ ‘షాక్’.. కిలో స్కిన్ లెస్ రూ.330

వేసవి ఎండల ప్రభావం, కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్ల జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రంజాన్ మాసం, ఇటు ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు భారీగా పెరగడంతో నాన్వెజ్ ప్రియులు చికెన్ సెంటర్ల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. NLG మార్కెట్లో లైవ్ కోడి KG రూ.192, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.300, స్కిన్ లెస్ కిలో రూ.330లకు విక్రయిస్తున్నారు.
News March 14, 2026
గ్యాస్ బుక్ అయినా నో డెలివరీ! మీకూ ఈ సమస్య ఉందా?

వంటగ్యాస్ ఇబ్బందులు తప్పట్లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYDలో గ్యాస్ బుక్ అయినా OTP రావట్లేదని, సిలిండర్ డెలివరీ కావట్లేదని వాపోతున్నారు. 4-5 రోజులుగా ఎదురుచూస్తున్నా స్పందన లేదంటున్నారు. కాగా కొందరు ఏజెన్సీలకు వెళ్లి సిలిండర్ తెచ్చుకుంటున్నారు. మరి గ్యాస్ బుకింగ్, డెలివరీలో మీరు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో కామెంట్ చేయండి.


