News December 2, 2025

HYD: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

image

కోవైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న ఇండిగో (6e 1234) విమానానికి బాంబు బెదిరింపు మేయిల్ వచ్చింది. అర్దరాత్రి 1:30 నిమిషాలకు బయలుదేరిన విమానం ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు విమానం చేరుకుంది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. ముంబయిలో ఇంకా ల్యాండింగ్ కానీ విమానం భయం గుప్పెట్లో ఫైలెట్ తోపాటు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 21, 2026

డిన్నర్‌కు వెళ్లా అంతే..: పుట్టా మహేశ్

image

AP: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో TDP అధిష్ఠానానికి MP పుట్టా మహేశ్ వివరణ ఇచ్చారు. డిన్నర్ కోసం పిలిస్తే అక్కడికి వెళ్లానని, డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో TDP <<19392082>>షోకాజ్<<>> నోటీస్ ఇచ్చింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు TG మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికీ BRS షోకాజ్ నోటీస్ ఇవ్వగా ఆయన స్పందించాల్సి ఉంది.

News March 21, 2026

విశాఖ: ‘సోషల్ మీడియాలో జాబ్స్ ప్రకటనలు నమ్మవద్దు’

image

హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన కేంద్రం పేరుతో నర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులపై సోషల్ మీడియాలో నకిలీ నియామక ప్రకటనలు వెలుగు చూశాయి. పోస్టుల సంఖ్య, జీతం, అర్హతలు, చివరి తేదీ వివరాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆసుపత్రి నుంచి విడుదల కాలేదని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే సమాచారం ధ్రువీకరించుకోవాలని సూచించారు.

News March 21, 2026

నల్గొండ- మాచర్ల రైల్వే మార్గంపై వీడని నిరీక్షణ

image

నల్గొండ నుంచి హాలియా మీదుగా మాచర్ల వరకు రైల్వే లైన్ కల సాకారం కోసం సాగర్ ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్లలో కేంద్రం రూ.2 కోట్లు కేటాయించి, రెండుసార్లు సర్వే నిర్వహించినా పనులు మాత్రం అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కనీసం వచ్చే బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి, ఈ నిరీక్షణకు తెరదించాలని ప్రజలు కోరుతున్నారు.