News December 2, 2025

వరంగల్: గుర్తులు రెడీ.. నోటా టెన్షన్..!

image

జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్‌కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్‌ను నిర్ణయించారు. బ్యాలెట్‌లో నోటా చేరడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.

Similar News

News March 7, 2026

అల్లు అర్జున్‌తో శిల్పా రవి

image

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

News March 7, 2026

సివిల్స్‌లో సత్తా చాటిన ఇల్లందు బిడ్డ

image

‘కష్టేఫలి’ అనే మాటకు నిదర్శనంగా నిలిచింది ఇల్లందుకి చెందిన బానోతు లక్ష్మీ రచన. ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆమె 178వ ర్యాంకు సాధించి మెరిశారు. బానోత్ వెంకటరమణ, తులసమ్మల కుమార్తె అయిన లక్ష్మి మూడుసార్లు విఫలమైనా పట్టు వదలకుండా నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లి త్రుటిలో అవకాశం కోల్పోయినా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించారు.

News March 7, 2026

కరీంనగర్: తమ్ముడే హంతకుడా..?

image

కరీంనగర్(D) రామడుగు(M)లో ఇటీవల జరిగిన గౌరమ్మను <<19305393>>గొంతు కోసి హత్య <<>>చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం విషయంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని తన తల్లిని తమ్ముడు అనిల్ కుమార్ హత్య చేసి ఉండవచ్చని పెద్ద కొడుకు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.