News December 2, 2025
మహబూబాబాద్: 344 సర్పంచ్, 857 వార్డు స్థానాలకు నామినేషన్లు

జిల్లాలో రెండో విడత ఎన్నికలకు సోమవారం సర్పంచ్కు 344, వార్డు స్థానాలకు 857 నామినేషన్లు దాఖలయ్యాయి. బయ్యారం, చిన్నగూడూర్, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూర్ మండలాల్లోని 158 గ్రామ పంచాయతీలు, 1360 వార్డులకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని అధికారులు వివరించారు.
Similar News
News December 3, 2025
మల్యాల: సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి.. సర్పంచ్ బరిలో నిలిచి

ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవకై ముందుకొచ్చారు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. మల్యాల మేజర్ GP సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరబత్తిని మాలతీ ప్రతాప్ మంగళవారం తన నామినేషన్ను దాఖలు చేశారు. కాగా, మాలతి గతంలో దుబాయ్లోని ప్రముఖ సంస్థ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్లో 18ఏళ్లు ఉద్యోగం చేశారు. ప్రస్తుతం HYDలోని విప్రో సంస్థలో నాలుగేళ్ల నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
News December 3, 2025
ధర్మశాస్తా దర్శనం: ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే?

అయ్యప్ప స్వాములు ఇరుముడితో 18 మెట్లు దాటిన తర్వాత ధ్వజస్తంభాన్ని దర్శిస్తారు. అనంతరం మణి మండపం, మహా గణపతి, సర్పరాజు వద్ద ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత చిన్ముద్ర ధారియైన అయ్యప్ప దివ్యమంగళ రూపాన్ని కనులారా దర్శించుకుంటారు. ఆ స్వరూపాన్ని గుండెల్లో నింపుకొని, ఇరుముడిని స్వామికి చూపిస్తారు. నెయ్యభిషేకం చేయిస్తారు. చివరగా మాలికపురత్తమ్మను దర్శించుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. <<-se>>#AyyappaMala<<>>
News December 3, 2025
VJA: నేడు సిట్ ముందుకు వైసీపీ నేతల కుమారులు

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు నేడు విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. జోగి రాజీవ్, రోహిత్ కుమార్, రాకేశ్, రామ్మోహన్కు నోటీసులు అందించారు. ఈ మేరకు గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వారు విచారణకు హాజరు కానున్నారు. లాప్టాప్లోని సమాచారం కోసం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.


