News December 2, 2025
చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్, అసైన్డ్ ల్యాండ్స్, రింగ్రోడ్, ఫైబర్నెట్, లిక్కర్ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.
Similar News
News March 19, 2026
వచ్చే నెలలో క్యాబినెట్ విస్తరణ!

TG: ఏప్రిల్ తొలి వారంలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతించిందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రివర్గంలో ఖాళీల భర్తీ, ఒకరిద్దరు కొత్త వారిని తీసుకోవడంపై అధిష్ఠానంతో CM రేవంత్ చర్చించారని సమాచారం. పలువురి శాఖలు మార్చేందుకూ పర్మిషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తరచూ వివాదాస్పదమవుతున్న మంత్రిపై వేటు పడుతుందని, కొత్తగా లంబాడా నేతకు ఛాన్స్ దక్కనుందని చర్చ సాగుతోంది.
News March 19, 2026
LPG గ్యాస్ ATM.. ఎక్కడంటే..?

దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో హరియాణాలోని గురుగ్రామ్లో ఏర్పాటైన ‘LPG గ్యాస్ ATM’ వైరలవుతోంది. BPCL పైలట్ ప్రాజెక్టుగా ఇటీవల స్మార్ట్ వెండింగ్ మెషీన్ ఏర్పాటు చేసింది. 24×7 ఓపెన్లో ఉండే ఈ ATM నుంచి వినియోగదారులు 2-3 నిమిషాల్లోనే సిలిండర్ తీసుకోవచ్చు. పైగా ఐరన్వి కాకుండా ఫైబర్ సిలిండర్లు ఇస్తారు. వీటి బరువు 15 KGలే కావడంతో ఈజీగా తీసుకెళ్లొచ్చు. మన దగ్గరా ఇలాంటివి వస్తే బాగుంటుంది కదూ. మీరేమంటారు?
News March 19, 2026
T20 WC: BCBకి షాక్ ఇచ్చిన బంగ్లా ప్రభుత్వం!

భద్రతా కారణాలతో T20 WC నుంచి <<18951531>>తప్పుకున్న<<>> బంగ్లా క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. ఇండియాకు వెళ్లేందుకు జట్టు నిరాకరించడంపై విచారణ ప్రారంభించనుంది. ‘WCలో మనం ఎందుకు పాల్గొనలేదు. క్రీడా దౌత్యంలో మన లోపాలు ఎక్కడ ఉన్నాయి. వీటిని అంచనా వేయడమే విచారణ ఉద్దేశం’ అని క్రీడల శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ చెప్పారు. ఈద్ తర్వాత విచారణ కమిటీ ఏర్పాటు చేసి, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


