News December 2, 2025

మెదక్: భార్యను చంపి భర్త సూసైడ్ !

image

మెదక్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. టేక్మాల్ మండలం బర్దిపూర్‌లో భార్యను చంపి, భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం(37), మంజుల (34) దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయానికి మంజుల హత్యకు గురికాగా, శ్రీశైలం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 16, 2026

హనుమకొండలో జిల్లా స్థాయి చెస్ పోటీలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగం పోటీలకు హనుమకొండ వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-7 నుంచి అండర్-15 విభాగాల్లో బాలబాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.

News March 16, 2026

కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

image

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.

News March 16, 2026

పెద్దపులి కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు..?

image

కొడిమ్యాల మండలం గంగారాం తండాలో రెండు రోజులుగా పశువులపై పెద్ద పులి దాడి చేయడంతో గంగారాం తండా, దమ్మయ్య పేట సూరంపేట గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట బయటకు రావద్దని వారు ప్రజలకు తెలిపారు.