News December 2, 2025
ఫైనల్స్కు మహబూబ్నగర్- వరంగల్ బాలికల జట్లు

సిరిసిల్లలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ బాలికల విభాగంలో మహబూబ్నగర్, వరంగల్ జట్లు ఫైనల్కు చేరాయి. ఈరోజు ఉదయం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు నిజామాబాద్ జట్టుపై విజయం సాధించగా, రెండో సెమీ ఫైనల్లో వరంగల్ జట్టు నల్గొండ జట్టుపై విజయం సాధించి ఫైనల్కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News April 6, 2026
పుష్కర ఘాట్లో స్నానాలకు ఏర్పాట్లు చేయాలి: శైలజా రామయ్యర్

మే మొదటి వారంలోగా నది ఘాట్ వద్ద క్లాడింగ్, రైలింగ్ పనులు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత కోసం బారికేడ్లు, హెలిప్యాడ్, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నదిలో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆర్అండ్బి, ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు.
News April 6, 2026
లేబర్ వెల్ఫేర్ పథకాల ప్రచారానికి కమిటీలు

AP: నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ-టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు టెండర్ ఈవాల్యుయేషన్, అప్రూవల్ కమిటీలను నియమిస్తూ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ-శ్రామ్ నమోదు, బాండెడ్ లేబర్ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది.
News April 6, 2026
లేబర్ వెల్ఫేర్ పథకాల ప్రచారానికి కమిటీలు

AP: నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ-టెండర్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు టెండర్ ఈవాల్యుయేషన్, అప్రూవల్ కమిటీలను నియమిస్తూ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ-శ్రామ్ నమోదు, బాండెడ్ లేబర్ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యమిస్తోంది.


