News December 2, 2025
HYD: తెల్లాపూర్ భూములపై రియల్ కన్ను..!

కోకాపేట భూముల వేలం ప్రభావం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలపై పడింది. ఇక్కడ ఉండే భూములపై రియల్ నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో స్థానికంగా భూయజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు ఈ భూములు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆందోళన చెందాల్సి వస్తుంది.
Similar News
News March 16, 2026
రాజవొమ్మంగి: పరీక్ష టెన్షన్.. తెలుగు టీచర్కు ప్రమాదం

రాజవొమ్మంగిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఆ ఒత్తిడిలో పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయురాలు డి. శ్రీదేవి ప్రమాదానికి గురయ్యారు. రాజవొమ్మంగి ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న ఆమె, సోమవారం ఉదయం స్కూల్ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె చేయి, కాలుకు గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను రాజవొమ్మంగి PHCకి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
News March 16, 2026
సిద్ధవటం: ప్రారంభమైన పది పరీక్షలు

మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి పరీక్షల సందర్భంగా సిద్ధవటం మండల ఎస్సై హారిక ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏఎస్ఐ సుబ్బరామచంద్ర, కొండయ్య, కానిస్టేబుల్ రాఘవ బందోబస్తులో పాల్గొన్నారు.
News March 16, 2026
టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.


