News December 2, 2025

HYD: రైల్వే ఫుడ్‌లో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తున్న ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశారు. రైల్వే ఫుడ్ ఓపెన్ చేసి తినే సమయంలో ఒక్కసారిగా దాంట్లో బొద్దింక కనబడటంతో షాక్ అయ్యాడు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యతపై చర్యలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను డిమాండ్ చేశారు.

Similar News

News March 16, 2026

నేను పార్టీ మారడం లేదు: ఎమ్మెల్యే మల్లారెడ్డి

image

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నాననే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. “నా వయస్సు 73 ఏళ్లు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు” అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే లాంటిదని ఎద్దేవా చేశారు. ఇటీవల CMని కలిసింది కేవలం తన ఓ వేడుకకు ఆహ్వానించడానికి మాత్రమేనన్నారు.

News March 16, 2026

సర్రోగేట్ తల్లుల ముసుగులో పిల్లల అమ్మకాలు!

image

సంతానం లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకొని సాగుతున్న భారీ దందాను ED బయటపెట్టింది. పేద మహిళలను ప్రలోభపెట్టి, వారితో పుట్టిన పిల్లలను భారీ ధరలకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆడపిల్లకు ₹3.5 లక్షలు, మగపిల్లకు ₹4.5 లక్షల చొప్పున బేరసారాలు సాగుతున్నాయి. ఈ అక్రమ సంపాదనతో కొన్న సుమారు 50 ఆస్తులను అధికారులు జప్తు చేశారు. ‘మనీ లాండరింగ్’ నెట్‌వర్క్‌ అని పక్కాగా నిర్ధారించారు.

News March 16, 2026

HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

image

నగరంలో వీకెండ్‌ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.