News December 2, 2025
గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు: కవిత

విద్యా శాఖ స్వయంగా CM వద్దే ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం సిగ్గుచేటని జాగృతి చీఫ్ కవిత అన్నారు. గద్వాలలోని ST సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఆమె ‘X’ వేదికగా స్పందించారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. ఇది ప్రభుత్వ చేతగానితనాన్ని, పేదింటి బిడ్డలంటే లెక్కలేనితనాన్ని బయటపెట్టిందన్నారు.
Similar News
News March 18, 2026
గన్నవరం ఎయిర్పోర్ట్లో గాలులు.. విమానం దారి మళ్లింపు

గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఈదురుగాలులు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయిన వెంటనే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశారు. విమానం కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టి, అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ గన్నవరం బయల్దేరి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
News March 18, 2026
SRPT: ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే!

జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ వద్ద నమోదు చేసుకోవాలని డీఎంహెచ్ఓ డా. పెండెం వెంకటరమణ ఆదేశించారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ప్రాక్టీస్ చేయడం నేరమని స్పష్టం చేశారు. గడువు ముగిసిన సంస్థలు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 18, 2026
అనంతపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన GO 284 ప్రకారం ఈ నియామకం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించి, పౌరులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు.


