News December 2, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడత నామినేషన్లు రేపటి నుంచి స్వీకరించనున్నారు. జిల్లాలో 9 మండలాలు అక్కన్నపేట, చేర్యాల, దూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరులో మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా మొదటి, రెండవ విడత నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమై మొదటి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. రెండో విడత నామినేషన్లు 3న ముగియనున్నాయి.
Similar News
News March 20, 2026
రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరికీ ఈ పండుగ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని చేకూర్చాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
News March 20, 2026
రంజాన్కు పటిష్ట భద్రత: సీపీ సునీల్ దత్

ఖమ్మం: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గోళ్లగూడెం ఈద్గాను సందర్శించారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈద్గా నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించారు.
News March 20, 2026
మదనపల్లె: ఘోరం.. ఇద్దరు చిన్నారుల మృతి

మదనపల్లె మండలంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు మండలం బల్తమూరుకు చెందిన శ్రీనివాసులు చీకిలబైలులో ఉంటున్నారు. వాళ్ల కుమారుడు కుశల్ రెడ్డి(10)తో పాటు తమ్ముడు కుమారుడు భువనేశ్వర రెడ్డి(6) బెంగళూరులో చదువుతున్నారు. వరుస సెలవులు కావడంతో శ్రీనివాసులురెడ్డి పిల్లలను బైకుపై తీసుకుని ఇంటికి బయల్దేరాడు. చీకిలబైలు వద్ద లారీ ఢీకొని ఇద్దరూ చనిపోయారు.


