News December 2, 2025
సిద్దిపేట: ఈ మండలాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

సిద్దిపేట జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడు విడత నామినేషన్లు రేపటి నుంచి స్వీకరించనున్నారు. జిల్లాలో 9 మండలాలు అక్కన్నపేట, చేర్యాల, దూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరులో మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా మొదటి, రెండవ విడత నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమై మొదటి విడత నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. రెండో విడత నామినేషన్లు 3న ముగియనున్నాయి.
Similar News
News March 14, 2026
ఏలూరు: పదోన్నతుల కోసం జిల్లా ఎస్పీకి బురిడీ

ఏలూరు జిల్లాలో ఏఎస్ఐ పదోన్నతుల వ్యవహారంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ను తప్పుదారి పట్టించేందుకు యత్నించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదోన్నతుల కోసం సమర్పించిన వినతిపత్రంలో మరో సహోద్యోగి సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసినట్లు ఎస్పీ గుర్తించారు. పోలీసులే స్వయంగా ఫోర్జరీకి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 14, 2026
ఇండక్షన్ స్టవ్లు వాడేవారికి తమిళనాడు ప్రభుత్వం గుడ్న్యూస్

గ్యాస్ సంక్షోభం వేళ విద్యుత్ స్టవ్లు వినియోగించే వ్యాపారులకు TN ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెస్టారెంట్లు, హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, టీ స్టాల్స్లో కరెంట్ యూనిట్పై రూ.2 సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రం విధించిన షరతులు అమల్లో ఉన్నన్ని రోజులు ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల పంపిణీ ప్రారంభమైనట్లు తాజాగా కేంద్రం పేర్కొంది.
News March 14, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు: ఎస్పీ

పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద, ప్రశ్నపత్రాలు తీసుకుని వెళ్లే సమయంలో బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.


