News December 2, 2025

కొత్తగూడెం సీఎం సభలో చిన్నారి వినూత్న ప్రచారం

image

సీఎం రేవంత్ రెడ్డి సభలో కొత్తగూడెం టౌన్ రామవరంకు చెందిన నైనిక రజ్వ వినుత్న ప్రచారం చేపట్టారు. మానవులకు ఆక్సిజన్ ప్రాణ వాయువు అని, చెట్లు ఆహారాన్ని నీడను ఔషధాలను ఇస్తాయని ప్లకార్డు ప్రదర్శించారు. వర్షాలకు, ప్రాణవాయువుకు కారణమైన చెట్లను పెంచకపోతే భవిష్యత్తులో వీపున ఆక్సిజన్ సిలిండర్ మోయాల్సి వస్తుందని పిలుపునిచ్చారు. వీపున సిలిండర్ ధరించి ప్రచారం చేపట్టారు. చిన్నారి ప్రచారాన్ని పలువురు అభినందించారు.

Similar News

News December 3, 2025

స్క్రబ్ టైఫస్.. జాగ్రత్తలపై అధికారుల సూచనలు

image

AP: ‘ఓరియంటియా సుత్సుగముషి’ బాక్టీరియాతో <<18446507>>స్క్రబ్ టైఫస్<<>> సంక్రమిస్తుందని అధికారులు వెల్లడించారు. కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చతో పాటు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్ టైఫస్‌గా అనుమానించాలని చెప్పారు. ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోని కీటకాలు కుడితే ఈ వ్యాధి వస్తుందన్నారు. పొలం పనులకు వెళ్లేవారు షూలు ధరించాలని, మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Share it

News December 3, 2025

ఖమ్మం: తొలి రెండు రోజులు మద్యం కిక్కు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం విక్రయాల కిక్కు అదిరింది.. 2025-27 ఎక్సైజ్ సంవత్సరానికి కేటాయించిన మద్యం దుకాణాల్లో సోమవారం నుంచి మద్యం విక్రయాలు మొదలయ్యాయి. తొలి రెండు రోజులు ఉమ్మడి జిల్లాలోని 204 వైన్ షాపులకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి సుమారు రూ.40 కోట్ల మద్యం సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఎక్సైజ్ సంవత్సరం ముగింపు చివరి నెల రోజులు వైన్ షాపుల్లో ఆశించిన మేర మద్యం విక్రయాలు జరగలేదు.

News December 3, 2025

ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

image

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.