News December 2, 2025
EPS-95 పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ

EPFO కింద కవరయ్యే EPS-95 పెన్షన్ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలన్న డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది. ఆ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. 2019 మార్చి 31నాటికి ఫండ్ విలువలో యాక్చురియల్ లోటుందని తెలిపింది. అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదు. MP సురేశ్ గోపీనాథ్ మాత్రే లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ సమాధానమిచ్చారు. ఈ స్కీమ్ కింద 80 లక్షలకుపైగా పెన్షనర్లున్నారు.
Similar News
News March 21, 2026
ఈనెల 23న ₹1.35లక్షల కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

AP: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మక ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఈనెల 23న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ₹1,35,964 కోట్లతో ఇది ఏర్పాటు కానుంది. ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తే లక్ష్యంగా 5,465 ఎకరాల్లో రెండు ఫేజుల కింద దీనిని నిర్మిస్తున్నారు.
News March 21, 2026
జాగ్రత్త.. రేపు పిడుగులతో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, ఉ.గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. TGలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 21, 2026
827 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

సశస్త్ర సీమా బల్(SSB)లో 827 కానిస్టేబుల్(నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, వెయిటర్, కార్పెంటర్ తదితర ఉద్యోగాలున్నాయి. టెన్త్ పాస్, సంబంధిత విభాగంలో ITI, డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, వయసు 18-27 ఏళ్లు ఉండాలి. PET/PST, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 21.
సైట్: https://ssb.gov.in/


