News December 3, 2025

TU: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. 6462 హాజరు

image

తెలంగాణ యూనివర్సిటీ లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలకు 6840 మంది విద్యార్థులకు గాను 6462 మంది హాజరు కాగా 378 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్,6వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు 30 పరీక్షా కేంద్రాల్లో ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు.

Similar News

News March 7, 2026

మహిళా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న జిల్లావ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. భీమవరంలోని విష్ణు కళాశాలలో జిల్లా స్థాయి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు.

News March 7, 2026

రేపే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

image

అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్-న్యూజిలాండ్ మధ్య T20WC ఫైనల్ జరగనుంది. దీంతో ప్రైజ్ మనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ టోర్నీ కోసం ICC మొత్తం ₹120Crను కేటాయించింది. విజేతకు ₹27.48Cr, రన్నరప్‌కు ₹14.65Cr అందుతాయి. సెమీస్‌లో ఓడిన SA, ENGకు ₹7.24Cr చొప్పున, సూపర్-8 వరకు వచ్చిన జట్లకు ₹3.48Cr, టోర్నీలో పాల్గొన్న 20 టీమ్స్‌కు ₹2.29Cr చొప్పున ఇవ్వనుంది.
* రేపటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News March 7, 2026

6 వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్’, అజీవికా మిషన్ పథకాలపై జిల్లావ్యాప్తంగా ఆరు వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఈ పథకాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధి అవకాశాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ ప్రచార లక్ష్యమని తెలిపారు.