News December 3, 2025
కన్నం వేసి.. రూ.8లక్షల పేలుడు పదార్థాల చోరీ

పెద్దవడుగూరు మండలం కోనాపురంలోని ఓ స్టోరేజ్ పాయింట్లో చోరీ జరిగింది. స్టోరేజ్ పాయింట్కు గుర్తు తెలియని వ్యక్తులు కన్నం వేసి, లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.8 లక్షల విలువైన పేలుడు పదార్థాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై స్టోరేజ్ పాయింట్ నిర్వాహకుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 24, 2026
ఆర్డీటీ పోరాటం సఫలం: మాజీ ఎంపీ తలారి రంగయ్య

ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం చేసిన పోరాటం ఫలించిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని గుంజి తాండ నుంచి చేపట్టిన పాదయాత్ర, పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా సంస్థకు న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేలా శుభవార్త రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్డీటీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News March 24, 2026
ATP: ఈ నెల 24, 25 తేదీలలో జేఎన్టీయూలో టెక్నికల్ ఫెస్ట్లు

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మార్చి 24, 25 తేదీలలో టెక్నికల్ ఫెస్ట్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి పేపర్ ప్రజెంటేషన్, టెక్నికల్ క్విజ్, ప్రాజెక్ట్ ఎక్స్పో వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య హాజరవుతున్నట్లు తెలిపారు.
News March 24, 2026
గుత్తి కోటకు నడక మెట్లు ఏర్పాటుకు సీఎం అనుమతి: కలెక్టర్

జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గుత్తి కోటకు సంబంధించి నడక మెట్లు ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వడం జరిగిందని, మెట్ల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ అంశాన్ని అజెండాలో పొందుపరచాలని పేర్కొన్నారు.


