News December 3, 2025
సీఎం పర్యటనను విజయవంతం చెయాలి: జేసీ

భామినిలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 5 తేదీ పర్యటనను విజయవంతం చెయ్యాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం భామినిలో మన్యం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎవరికి కేటాయించిన పనులు వారు పక్కగా నిర్వహించాలని కోరారు. ప్రధానంగా విద్యుత్, రహదారులు, ట్రాఫిక్, మెడికల్ సర్వీసులు అందుబాటులో ఉండాలని, ప్రోటోకాల్ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు.
Similar News
News March 27, 2026
తిరుపతి జిల్లాలో భారీ మార్పులు

తిరుపతి జిల్లాలో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డివిజన్లు, వార్డులు పెరగనున్నాయి. వీటితో పాటు 25నుంచి 30వరకు పంచాయతీలు పెరిగేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు కూడా పెరిగారు. రిజర్వేషన్లపై క్లారిటీ వస్తే పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.
News March 27, 2026
GNT: కళల కాణాచి ముద్దుబిడ్డ గుత్తికొండ నరహరి

కళలకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా.. కళల కాణాచి తెనాలి. ఈ గడ్డపై జన్మించిన గొప్ప మేధావి గుత్తికొండ నరహరి. ఆయన అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. తెలుగు రాజకీయాల్లో అసమాన వక్తగా, రచయితగా, విశ్లేషకుడిగా చెరగని ముద్ర వేశారు. మూఢనమ్మకాలపై పోరాడి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం రేకెత్తించారు. గొప్ప నవ్య మానవవాదిగా పేరొందిన నరహరి వర్ధంతి నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
News March 27, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

విశాఖపట్నం నుంచి శుక్రవారం బయలుదేరాల్సిన 20830 వందే భారత్ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్ అయింది. అనుసంధాన రైలు ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 2:50 గంటలకు బదులుగా, సాయంత్రం 4:40 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.


