News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News March 13, 2026
కావలి: రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. తలమంచి- అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని సుమారు 27ఏళ్ల వ్యక్తి బెంగళూరు- గువాహటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కావలి రైల్వే పోలీసులకు తెలపాలని కోరారు.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత.. JC క్లారిటీ

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ వినియోగానికి సరిపడా LPG సిలిండర్లు నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.
News March 13, 2026
నెల్లూరు జిల్లాలో హోటళ్లు క్లోజ్!

నెల్లూరు జిల్లాలో 2వేల వరకు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు నడిపిస్తున్నారు. ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్కు ఒకేసారి ప్రయత్నించడంతో కంపెనీలు సర్వర్లను బంద్ చేసినట్లు తెలుస్తోంది.


